Wednesday 5 April 2017

వేప...దాని ఉపయోగాలు...!





    తెలుగువారి ఉగాది వచ్చిందంటే... వేపపువ్వుతో చేసిన పచ్చడి తినందే ఆ పండుగ అసంపూర్ణమే! ఉగాది సందర్భంలో వచ్చే వేపపూలని తినేందుకు ప్రోత్సహించడమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ వేపపచ్చడి ఎండాకాలంలో రాబోయే అంటురోగాలను శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే వేపతో మన అనుబంధం కేవలం ఉగాదితో తీరిపోయేది కాదు. వేపకి ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి!

    - వేపని మనం చెట్టుగా కాకుండా దేవతగా భావిస్తూ ఉంటాము. ఆ దేవత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాము. అందుకే ఉగాది వంటి సందర్భాలలోనే కాకుండా గ్రామదేవతల జాతర్లలో కూడా వేపమండలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు.

    - వేపచెట్టు నుంచి వీచేగాలి, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు.
    అందుకే అవధూతలు సైతం వేపచెట్లు ఉండే ప్రాంతంలో తిరిగేందుకు ఇష్టపడతారట. వేపచెట్టు కింద నిద్రించేవారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆయుర్వేదం చెబుతోంది.

    - వేప ఆకు, పూలు, బెరడు, కాయలు... ఇలా వేపచెట్టులోని అణువణువూ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చరకసంహిత వేపను సర్వరోగనివారిణిగా పేర్కొంటోంది. వేపతో నింబాదితైలం లాంటి అనేక లైపనాలు, తైలాలు, చూర్ణాలను తయారుచేస్తారు.

    - రోజూ క్రమం తప్పకుండా వేపచిగుళ్లని తింటూ ఉంటే షుగర్ వ్యాధి దరిచేరదు.

    - వేపచిగుళ్లని తినడం వల్ల పేగులలో ఉన్న హానికారక సూక్ష్మజీవులు, నులి పురుగులు కూడా చచ్చిపోతాయి.

    - వేపపుళ్లలతో పళ్లు తోముకుంటే పళ్లు, చిగుళ్లు దృఢంగా ఉండటమే కాకుండా... పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వెంట రక్తం కారడం వంటి సమస్యలు కూడా దరిచేరవు.

    - వేపలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకనే చర్మానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేపాకులను కాచిన నీటితో కానీ వేపనూనెతో తయారుచేసిన సబ్బులని కానీ రుద్దుకుంటే చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి, శరీరం దుర్గంధాన్ని నివారిస్తుంది.

    - వేపలో యాంటీవైరల్ సుగుణాలు ఉన్నాయి. అందుకే పొంగు, మశూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు... రోగులను వేపమండల మీద పడుకోపెట్టేవారు.

    - వేపాకుల గుజ్జుని కనుక తలకి పట్టిస్తే చుండ్రు, పేలులాంటి జుట్టుకి సంబంధించిన సమస్యలు మాయమైపోతాయి.

    - వైద్యుడి సూచనల ప్రకారం వేప చూర్ణాన్ని తీసుకుంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    - నేతిలో కాచిన వేపాకుని కానీ వేప పండ్లు లేదా ఆకుల గుజ్జుని కానీ మొటిమలు, పుండ్లు మీద రాస్తే ఒకటి రెండు రోజులలోనే ఫలితం కనిపిస్తుంది.

    - వేప పండ్లు, విత్తనాల నుంచి తీసిన నూనె అద్భుతమైన క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. ఒకరకంగా ప్రకృతి సిద్ధమైన pesticide, insecticideలలో వేపదే ప్రథమ స్థానం.

    - వేప పూతని ఉగాది పచ్చడిలో వాడటం మనకి తెలిసిందే. దీనిని నింబకుసుమభక్షణం అంటారు. వేపపువ్వు, వేపకాయలు, లేత వేప చిగుళ్లని ఉపయోగించి వంట చేయడం కూడా కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది.

    Tuesday 4 April 2017

    ముఖ్యమైన కొన్ని వంటింటి చిట్కాలు...!


    ► టొమాటోలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిజ్‌లో వెజిటబుల్‌ ట్రేలో వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా పక్కపక్కన పెట్టాలి. అది కూడా ఫొటోలో ఎడమ చేతిలో ఉన్నట్లు కాకుండా కుడి చేతిలో ఉన్న విధంగా బోర్లించినట్లు సర్దుకోవాలి. ఇదే విధంగా ఒక వరుస మీద మరో వరుస వచ్చేటట్లు పేర్చుకుంటే ఒకదాని బరువు మరొకదాని మీద పడకుండా తాజాగా ఉంటాయి.

    ►టొమాటో,ఉల్లిపాయ ఒలవాలంటే వాటిని మరుగుతున్న నీటిలో వేసి తీసి చన్నీటి ధార కింద పెడితే (వాటర్‌ టాప్‌ కింద) త్వరగా ఊడి వచ్చేస్తుంది. టొమాటోలకైతే పదిహేను సెకన్లు, ఉల్లిపాయలైతే రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది.

    ►ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్‌ తరిగే ముందు చాకును చన్నీటితో తడిపితే త్వరగా కట్‌ అవుతాయి.

    ►మాంసం కాని చికెన్‌ కాని మరీ పలుచని ముక్కలుగా కట్‌ చేయాలంటే ఇరవై నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఒక మోస్తరుగా గట్టిపడుతుంది కాబట్టి కట్‌ చేయడం సులభమవుతుంది. సమయం ఆదా ఆవుతుంది.

    ► నిమ్మకాయ నుంచి రసం మొత్తం రావాలంటే కోసే ముందు కాయను కిచెన్‌ ప్లాట్‌ఫాం మీద పెట్టి అరచేత్తో రుద్దాలి. ఇలా చేస్తే కాయ మెత్తబడి పిండిన వెంటనే రసం మొత్తం వచ్చేస్తుంది. రసం తీసే టైం తగ్గుతుంది.

    ►వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే ఒలిచేటప్పుడు ఒకవైపు చాకుతో గాటు పెట్టి చివర నొక్కాలి.

    ► ఎక్కువ రేకలు కావల్సినప్పుడు వేడి నీటిలో వేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేసి ఆ గిన్నెను చన్నీటి ధార కింద రేకలకు నీటి వత్తిడి తగిలే విధంగా పెడితే పొట్టు ఊడిపోయి నీళ్ల మీదకు తేలుతుంది.

    ►వంటల వాసన ఇల్లంతా వ్యాపించకుండా ఉండాలంటే వండేటప్పుడు వంటగదిలో తడి టవల్‌ను ఆరేస్తే వాసన టవల్‌కు పట్టేసి గది ఫ్రెష్‌గా ఉంటుంది.

    Sunday 2 April 2017

    ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఉపయోగాలు ఏంటి..?

    బీమా ప్రతి ఒక్కరికీ అవసరం. మన దేశంలో దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ బీమా కలిగిన వారు తప్పకుండా ఉంటారు. సంపాదన పరుల పేరు మీద కనీసం రెండు పాలసీలకు తక్కువ కాకుండా అయినా ఉంటాయి. ఐదు, పది పాలసీలు కలిగిన వారు కూడా ఉన్నారు. మరి ఇన్నేసి పాలసీ పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం భద్రమేనా...? 
    పేపర్ రూపంలో ఉండే పత్రాలను ఇంట్లో జాగ్రత్తపరచడం అన్నది శ్రమే. తడిసినా, చిరిగినా ఇబ్బందే. ఎక్కడైనా తప్పిపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకటికి మించి పాలసీలు కలిగి ఉన్న వారు చిరునామా మారినప్పుడు దాన్ని మార్చుకోవడానికి అన్ని కంపెనీలకు వరుసపెట్టి లెటర్లు రాయాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇన్సూరెన్స్ రిపాజిటరీ (ఐఆర్).

    ఇన్సూరెన్స్ రిపాజిటరీ అంటే...?

    బీమా పత్రాలను పాలసీదారుల తరఫున ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉంచే సంస్థే ఇన్సూరెన్స్ రిపాజిటరీ. షేర్లను, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, సెక్యూరిటీలను డీమ్యాట్ ఖాతా ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకున్నట్టే... ఈ ఇన్సూరెన్స్ ఖాతా ద్వారా డిజిటల్ రూపంలో బీమా పత్రాలను దాచుకోవచ్చు. ఒక్కరు ఒక రిపాజిటరీ ఖాతా మాత్రమే కలిగి ఉండాలన్నది నిబంధన. 2013 నుంచి ఈ సేవలు మన దేశంలో అమల్లో ఉన్నాయి.

    ఏఏ సంస్థలు

    ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఐదు సంస్థలకు రిపాజిటరీ సేవల నిర్వహణకు గాను అనుమతించింది. వీటిలో ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్ మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, క్యామ్స్ రిపాజిటరీ సర్వీసెస్, కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఉన్నాయి. తొలిగా సేవలు ప్రారంభించినది మాత్రం క్యామ్స్ రిపాజిటరీ. 
    • NSDL Database Management Limited – www.nir.ndml.in 
    • Central Insurance Repository Limited – www.cirl.co.in 
    • SHCIL Projects Limited– – www.shcilir.com 
    • Karvy Insurance Repository Limited – www.kinrep.com 
    • CAMS Repository Services Limited – www.camsrepository.com

    ఉపయోగాలు ఏంటి..?

    రిపాజిటరీలలో ఈ-పత్రాల రూపంలో దాచుకోవడం వల్ల ఇంట్లో భౌతిక పత్రాలను ఉంచుకునే ఇబ్బంది తప్పుతుంది. ఎన్ని పాలసీలు ఉన్నా... ఒకే ఖాతా ద్వారా అన్నింటినీ నిర్వహించుకోవడం వల్ల సులభంగా ఉంటుంది. అన్ని రకాల జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా, యాన్యుటీ ప్లాన్లను ఈ రూపంలో భద్రపరచుకోవడానికి అవకాశం ఉంది. 
    నామినీ వివరాలు మార్చుకోవడం, చిరునామా మార్చుకోవడం చిటికెలో పని. ఎన్ని పాలసీలు ఉన్నాగానీ రిపాజిటరీకి సమాచారం ఇస్తే... పాలసీదారుడు తరఫున రిపాజిటరీయే బీమా కంపెనీలకు సమాచారం పంపిస్తుంది. అంటే సేవల్లో వేగం పెరుగుతుంది. పాలసీ పత్రం పోతుందన్న భయం ఉండదు. అన్ని రకాల పాలసీలకు ఒకటే వేదిక అవుతుంది. పరిహారం సమయంలో తప్పితే బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఖర్చులు తగ్గడం వల్ల ప్రీమియం కూడా తగ్గుతుందన్నది ఐఆర్డీఏ చెబుతున్న మాట.

    చార్జీల సంగతి..?

    ఖాతా తెరిచేందుకు, ఖాతాలో బీమా పత్రాలను దాచుకున్నందుకు గాను ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు ఉచితం. ప్రస్తుతం పత్రాల రూపంలో ఉన్న బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకునేందుకు కూడా చార్జీలు లేవు. ఇన్సూరెన్స్ కంపెనీలే కొంత చార్జీలను రిపాజిటరీ సంస్థలకు చెల్లిస్తాయి. అయితే, భవిష్యత్తులో ఈ ఖాతాలపై నిర్వహణ చార్జీలు, సేవల (చిరునామా, నామినీ తదితర వివరాల మార్పు) చార్జీలు చెల్లించాల్సి రావచ్చు.

    పాలసీ తీసుకోవడం సులభం

    ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఖాతా ఉంటే కొత్తగా పాలసీ తీసుకోవడం చాలా సులభం. కొత్త పాలసీ దరఖాస్తులో రిపాజిటరీ ఖాతా నంబర్ వేస్తే సరిపోతుంది. పాలసీ పత్రం కూడా వేగంగా జారీ అవుతుంది. కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) నిబంధనలు కూడా రిపాజిటరీ ఖాతా ప్రారంభంలో పాటించి ఉంటారు కనుక కొత్త పాలసీ సమయంలో వేరే ఇతరత్రా పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

    ప్రస్తుత పత్రాలను ఈ పత్రాలుగా మార్చుకోవడం ఎలా?

    ముందుగా ఇన్సూరెన్స్ రిపాజిటరీ వద్ద ఖాతా ప్రారంభించాలి. అందుబాటులో ఉన్న ఐదు సంస్థల్లో ఏదో ఒక దాని నుంచి ఖాతా ప్రారంభించవచ్చు. ఇప్పటికే ఫిజికల్ రూపంలో పాలసీ పత్రాలను కలిగి ఉన్నవారు ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకోవాలనుకుంటే... దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు బీమా పత్రాలను జతచేసి బీమా కంపెనీకి సమర్పించాలి. అప్పుడు కంపెనీ పరిశీలన అనంతరం ఈ రూపంలో బీమా పాలసీ జారీ చేస్తుంది. 
    దరఖాస్తు చేసుకున్న అనంతరం ఈ ఇన్సూరెన్స్ ఖాతా ఏడు రోజుల్లోపల ప్రారంభం అవుతుంది. ఖాతా ప్రారంభించిన వెంటనే ఖాతాదారులకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ జారీ చేస్తారు. దాంతో ఎక్కడి నుంచి అయినా ఈ ఇన్సూరెన్స్ ఖాతాలో లాగిన్ అయి వివరాలు పరిశీలించుకోవచ్చు. పాలసీ ప్రీమియంను రిపాజిటరీ ద్వారా కూడా చెల్లించవచ్చు. భవిష్యత్తులో అన్ని పాలసీలు ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాలని ఐఆర్డీఏ ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకుని రిపాజిటరీ ఖాతా తెరిచి బీమా పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవడం బెటర్. 
    పాలసీలు ఉన్నవారే కాదు, భవిష్యత్తులో పాలసీలు తీసుకోవాలనుకునే వారు సైతం ఈ ఇన్సూరెన్స్ ఖాతా తీసుకోవడం మంచి ఆలోచనే. ఒక రిపాజిటరీ దగ్గర ఈ ఇన్సూరెన్స్ ఖాతా కలిగి ఉన్నవారు దాన్ని మరో రిపాజిటరీ సంస్థకు మార్చుకోవాలనుకుంటే అందుకు అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తమ పాలసీదారులు పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకునేందుకు వీలుగా ఐదు రిపాజిటరీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

    Saturday 1 April 2017

    ఫేస్ బుక్ లో వీడియోలు వాటంతటవే ప్లే అయిపోతున్నాయా...?అయితే ఇదిగో పరిష్కారం...!

    మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..? ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ను కొందరు ఇష్టపడుతుంటే మరికొందరు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.తాజాగా, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ‘Automatic video-playback' పట్ల పలువురు యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వ్యక్తమవుతోంది. 
    ఈ ఫీచర్, వీడియోలను ఇష్టపడి ప్లే చేసుకునే స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఫేస్‌బుక్ ఆటోమెటిక్ వీడియో ప్లేబ్యాక్ ఫీచర్‌లో భాగంగా ఫేస్‌బుక్ పేజీలలో వీడియోలు డీఫాల్ట్‌గా ఆటో‌ప్లే అవటం మీరు గమనించే ఉంటారు. 
    వీడియోలు రన్ అవుతున్నంత సేపు మన బ్యాండ్ విడ్త్ ఖర్చవుతూనే ఉంటుంది. వీడియో రంగంలో యూట్యూబ్‌ను అధిగమించేందకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
    ఏమైనప్పటికి ఈ ‘Automatic video-playback' ఫీచర్ మీకు ఇబ్బందని అనిపించినట్లయితే వెంటనే disable చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...

    1.డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే

    ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత స్ర్కీన్ కడు వైపు పై భాగంలో ఏర్పాటు చేసిన downward arrow sign పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. ఆ menuలో ‘సెట్టింగ్స్ ఆప్షన్' పై క్లిక్ చేయండి.ఇప్పుడు కనిపించే General Account Settingsలో ఎడమచేతి వైపు కనిపించే videos ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వీడియో సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత Default మోడ్‌లో ఉన్న ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చండి. అంతే, వీడియోలు ఆటోప్లే అవటం మానేస్తాయి.

    2.మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే

    On, Wi-Fi only, Off ఆప్షన్‌ల ద్వారా వీడియో ఆటో - ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్ లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

    3.ఐఫోన్ లేదా ఐప్యాడ్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే 

    ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌‌ను సెలక్ట్ చేసుకోండి. ఫేస్‌బుక్ సెట్టింగ్స్ మెనూలోని ఆటో - ప్లేను సెలక్ట్ చేసుకుని Video Auto-play మోడ్‌ను మీకు నచ్చిన విధంగా మార్చుకోండి.

    Thursday 30 March 2017

    పచ్చిమిరపకాయల అద్భుత ఔషధ గుణాలు...!

    పచ్చిమిరపకాయల గురించి నమ్మలేని నిజాలు!

    సూప్... అల్పాహారం... కర్రీ, చారు, మిక్చర్, బజ్జీ... ప్రతి దానిలోనూ పచ్చిమిరప ఉండాల్సిందే. వంటకమేదైనా స్పైసీ కోరుకునేవారు దీని నామస్మరణ చేయక తప్పదు. ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరప ఉండును అనేంతగా దీనికి ప్రత్యేకత ఉంది. న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పచ్చిమిరపలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.

    తిన్న మూడు గంటలపాటు హుషారే

    పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా అన్న విషయం తెలుసా... ఇది నిజం. కానీ, కేలరీలకు మించి మనకు శక్తినిస్తాయి. ఎలా అంటారా... ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది.

    కేన్సర్ నుంచి రక్షణ

    కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.

    గుండె పదిలం

    గుండెకు పచ్చిమిరప రక్షణ కవచం అంటే నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను నివారిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అలాగే రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

    మంటలోనే ఉంది ఔషధం

    మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

    సైనస్ ఉన్నవారికి మంచి పరిష్కారం

    జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి మ్యూకస్ మెంబ్రేన్లలను ఉత్తేజపరుస్తుంది. మెంబ్రేన్లకు రక్త సరఫరా మంచిగా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనేది ఒక టిష్యూ. ఇందులో శ్లేష్మం (మ్యూకస్) ఏర్పడడాన్నే సైనస్ గా చెప్పుకోవచ్చు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడుతుంది. దీంతో ఉపశమనం లభిస్తుంది.

    నొప్పి నివారిణి

    మిరపకాయలతో వచ్చే మంట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. అంతేకాదు, జీర్ణమవడానికి, మంట ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి. అయితే, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే బెటర్.

    మిరపకాయలను ఎక్కడ సోర్టేజ్ చేయాలి?

    విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి. పచ్చిమిరపకాయలను చీకటిగా ఉండే, చల్లటి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. వెలుగుకు, వేడికి, గాలికి ఎక్స్ పోజ్ కావడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సీ కోల్పోవడం జరుగుతుంది.

    మూడ్ బాలేదా... మిరపకాయ లాగించాల్సిందే!

    మూడ్ బాలేదా, శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తోందా...? అయితే, పచ్చిమిరపకాయలు లాగించండి. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనంగానూ పనిచేస్తాయి.

    మధుమేహులకూ...

    రక్తంలో షుగర్ స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.

    ఐరన్ తగినంత

    వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్న వారికి మిరప మంచి ఔషధం.

    చర్మానికి రక్షణ

    వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.

    విటమిన్ కే

    పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడ తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్ ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది.

    Monday 27 March 2017

    ఆధార్ కార్డ్ లోని సమాచారాన్ని స్వయంగా ఆన్ లైన్ లో సరిచేసుకోవడం ఎలా...?


    ఆధార్ కార్డు తీసుకున్నాం.. పేరులో తప్పు దొర్లింది... లేదా చిరునామా మారింది. పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లేదా ఇతరత్రా సమాచారంలో ఏదేనీ మార్పులు చోటు చేసుకుంటే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం. నెట్ సదుపాయం ఉంటే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లి స్వయంగా మనమే సరిచేసుకోవచ్చు. అదెలానో చూద్దాం... 


    ముందుగా ... 
    https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం. 
    ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది. 
    కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు. 
    ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.

    రిజిస్టర్ మొబైల్ నంబర్ మనుగడలో లేకుంటే

    ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది. కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు.

    చిరునామాలు

    Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India. 
    Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad – 500034, India. 
    కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.

    మీ పెన్‌డ్రైవ్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవటం ఎలా...

    పెన్‌డ్రైవ్‌లను ముఖ్యంగా డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఉపయోగిస్తాం. ఏ విధమైన ప్రొటెక్షన్ లేకపోయినట్లయితే మన పెన్‌డ్రైవ్‌లో స్టోర్ అయి ఉన్న సమాచారాన్ని ఇతరులు సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా పెన్‌డ్రైవ్‌లోని డేటాను ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు. పెన్‌డ్రైవ్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోగలిగే తీరైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది.
    పెన్‌డ్రైవ్‌లను ప్రొటెక్ట్ చేసేందకు విండోస్ అధికారికంగా అందిస్తోన్న మాన్యువల్ పద్ధతే BitLock Encryption. ఈ ప్రొటెక్షన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా పెన్‌డ్రైవ్‌ను యూఎస్బీకి కనెక్ట్ చేసే ప్రతిసారి బిట్‌లాక్ కోడ్‌ను ఎంటర్ చేసి డ్రైవ్‌లోని డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

    STEP 1: మీ పెన్‌డ్రైవ్‌‌ను ముందుగా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. 

    STEP 2 : పెన్‌డ్రైవ్‌ కనెక్ట్ అయిన వెంటనే మైకంప్యూటర్స్‌లోకి వెళ్లి యూఎస్బీ డ్రైవ్ పై మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వండి.

    STEP 3 : ఇప్పుడు కనిపించే ఆప్షన్స్ మెనూలో Turn on BitLockrను సెలక్ట్ చేసుకోండి. 

    STEP 4 : ఇప్పుడు BitLock Encryption డ్రైవ్‌కు సంబంధించిన ప్రత్యేకమైన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ బాక్సులో "use a password to unlock the drive" ఆప్షన్‌ను టిక్ చేయండి.  
    STEP 5 : ఆ మెనూలో కనిపించే ఖాళీల్లో మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి. 

    STEP 6 : తరువాత కనిపించే మెనూలో save the recovery key to file అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ పాస్‍వర్డ్‌ను కంప్యూటర్‌లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.

    STEP 7 : next బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పెన్‌డ్రైవ్‌లోని పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి. 

    STEP 8 : ఎన్‌క్రిప్సన్ పూర్తయ్యాక close బటన్ పై క్లిక్ చేయండి. పెన్‍డ్రైవ్‌ను తీసి మరలా పీసీకి కనెక్ట్ చెయ్యండి. ఇక పై మీరు, మీ పెన్‌డ్రైవ్‌ను ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా Password ఎంటర్ చేస్తేనే డ్రైవ్ ఓపెన్ అవుతుంది.

    Sunday 26 March 2017

    VLC మీడియా ప్లేయర్ కీ బోర్డు షార్ట్ కట్స్ తెలుసుకోండి...


    Saturday 25 March 2017

    ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?


     కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయాలని చెబుతోంది. అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయాలని చెబుతోంది. అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చాలామందికి ఎలా లింక్ చేయాలో తెలియదు..ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలాగో ఓ సారి చూద్దాం. త్వరగా ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయండి, లేకుంటే పాన్ కార్డు చెల్లదు

    1.https://incometaxindiaefiling.gov.in లో మీరు ముందుగా  లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలతో అందులో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది.

    2.మీరు లాగిన్ కాగానే మీకు అక్కడ పాప్ అప్ విండో ఒకటి కనిపిస్తుంది. ఆధార్ లింక్ చేయమని అడుగుతుంది.అక్కడ మీరు ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుందిమీరు ఇచ్చిన వివరాలు కరెక్ట్ గా ఉంటే అక్కడ Link Now అనే ఆప్సన్ మీకు కనిపిస్తుంది.

    3.దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది. దాంతో పాటు మీ మెయిల్ కి ఓ లింక్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓటీపీ యాడ్ చేయాల్సి ఉంటుంది.

    ఆ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్ కనిపిస్తుంది. మీ పని అయిపోయినట్లే.

    Friday 24 March 2017

    సులువుగా బరువుని తగ్గించుకోవడానికి చిట్కాలు....


    బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయిపోతే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్న వారు పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ చిట్కాల గురించి తెలుసుకోండి.

    కార్బో హైడ్రేట్లను తగ్గించండి

    కార్బోహైడ్రేట్లు, ఫాట్స్ బరువు పెరడానికి దోహదం చేస్తాయి. అందుకని వీటి మోతాదును తగ్గించి ప్రొటీన్ తో కూడిన ఆహారాన్ని పెంచాలి. పాలల్లో ప్రొటీన్ పొడి వేసుకుని తాగినా సరే. ప్రొటీన్ షేక్స్ అయినా ఓకే. వీటివల్ల కడుపు నిండినట్టు ఉంటుంది.

    కేలరీలను కరిగించాలి

    రోజువారీ శారీరక వ్యాయామాన్ని మించింది లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కదలకుండా కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలా అయితే ఆరోగ్యానికి మహా ముప్పే. శారీరక వ్యాయామం చేయమన్నారుగా అని వ్యాయామశాల కోసం వెతకాల్సిన పనేమీ లేదు. రోజూ నిర్ణీత సమయం పాటు వేగంగా నడిచినా సరిపోతుంది.

    మెటబాలిజం రేటును పెంచుకోవాలి

    మెటబాలిజం వేగం పుంజుకుంటే మరిన్ని కేలరీలు ఖర్చయిపోతాయి. రోజువారీ వ్యాయామంతోపాటు మెటబాలిజం రేటును పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్సినియా, అకాయ్ బెర్రీ ల్లాంటివి. 
    మధ్య మధ్యలో బరువును చూసుకుంటూ ఉండాలి. చిట్కాలు పాటించక ముందు, పాటించిన తర్వాత వచ్చిన మార్పులను గమనించాలి. ఫలితాలను బట్టి ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా? అనే విషయం స్పష్టమవుతుంది.

    

    Thursday 23 March 2017

    HOW TO GET RID OF VIRUS FROM YOUR COMPUTER...

    Computer viruses are more like their biological counterparts,leaves the same to Computer once if it gets affected. If you think your computer has been infected bu viruses, the only safe course of action is to use a good anti-virus program.


    Step1:As soon as you suspect that your computer has a virus, remove your computer from any networks it might be on, as well as from the Internet, so that you don't inadvertently spread the bug to others. Unplug your network cable if you have to.
    Step2:If you have virus-scanning (anti-virus) software installed, run it.
    Step3:If you don't have anti-virus software, you'll need to obtain some. If you can't get it from a network administrator or download it from an uninfected computer, you can mail-order it from a retailer.
    Step4:Start your computer (still not connected to a network) and follow the instructions that came with the anti-virus software.
    Step5:Keep running the virus-scanning software until your computer comes up clean.
    Step6:Reconnect your computer to the Internet and check with the anti-virus software's publisher to make sure you have the latest updates. If not, download them now.
    Step7:After updating the anti-virus software, run it again until your computer comes up clean.

    Warning:There's no substitute for prevention. Good anti-virus software more than pays for itself as long as you keep it up-to-date.Common sense also goes a long way toward keeping your computer clean.
    Never open an attachment from someone you don't know, and be suspicious of odd attachments from people you do know (a virus may have mailed itself to you from their computer).

    మధుమేహం వున్నవారు పాటించాల్సిన వ్యాయామ సూత్రాలు...!


    వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
    * వ్యాయామం వల్ల కండరాలు పటిష్ఠంగా ఉంటాయి. కణాలు ఇన్సులిన్ ను గ్రహించే శక్తి మెరుగవుతుంది. సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లు, సెరటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది. 
    * లో బ్లడ్ షుగర్ అనేది హై బ్లడ్ షుగర్ (హైపో గ్లైసేమియా) కంటే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. అందుకని వ్యాయమానికి బయల్దేరే ముందు మధుమేహులు కాస్తంత స్నాక్స్ తీసుకోవాలి. లేదా క్యాండీస్, గ్లూకోజ్ బిస్కట్లు, జ్యూస్ వంటివి వెంట తీసుకెళితే షుగర్ తక్కువైపోయి అత్యవసర పరిస్థితి ఏర్పడితే తీసుకునేందుకు అనువుగా ఉంటాయి. 
    * షుగర్ వ్యాధి ఉన్న వారు పాదాలను అపురూపంగా చూసుకోవాలి. కనుక సౌకర్యంగా ఉన్న పాదరక్షలను ధరించాలి. వ్యాయామానికి ముందు, తర్వాత బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల వ్యాయామం ఎంత మేరకు చేయాలన్న విషయమై చక్కటి అవగాహన ఉంటుంది. 
    * డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్నవారు దూకడం (జంపింగ్) వంటి పనులకు దూరంగా ఉండాలి. పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. సింపుల్ ఎక్సర్ సైజ్ లు వీరికి మంచిది. 
    * రోజుకు కనీసం పదివేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి. వ్యాయామానికి వెళ్లేటప్పుడు మీ వివరాలను తెలిపేలా, అత్యవసర సందర్భాల్లో సంప్రదించాల్సిన వారి నంబర్ తో ఓ ఐడీ దగ్గర ఉంచుకోవడం నయం.

    Tuesday 21 March 2017

    మదుమేహం వున్నవాళ్లు కూడా మామిడిపండు తినవచ్చునట...!

    మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తోంది. మామిడి పండును చూసినా... ఆ పండు వెదజల్లే పరిమళం ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండడం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. మరి మామిడి పండును నిర్భయంగా తినవచ్చా...? 
    నిశ్చింతగా తినవచ్చు అంటున్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్. కాకపోతే, ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఒక మ్యాంగోలో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. 
    కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు. స్నాక్స్ టైమ్ లో స్నాక్స్ కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చు. వేయించిన శనగలు లేదా పెసరపప్పుతో పాటు మామిడి పండును తీసుకున్నట్లయితే ప్రొటీన్స్, ఫైబర్ తగినంత లభించి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉంటుంది.

    Monday 20 March 2017

    Here is How to use UPI mobile wallet ...!

    పార్టీ ఇస్తానని చెప్పి ఫ్రెండ్స్, కొలీగ్స్ ను రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. అతిథి దేవోభవ అన్న రీతిలో కోరిందల్లా ఆర్డర్ ఇచ్చుకుని కుమ్మేయండని ప్రోత్సహించారు. ఓహోహో.. నాకే విందు.. హ్హహ్హహ్హ అంటూ అందరూ సుష్టుగా కానిచ్చేశారు. వెళ్లింది ఐదుగురు.. బిల్లు చూస్తే 8వేలు. ఇంతేనా, అంటూ జేబులో చేయి పెట్టారు. వ్యాలెట్ కనిపించలేదు. నగదు, బ్యాంకు కార్డులు కూడా అందులోనే ఉన్నాయే...! మొహం ఒక్కసారిగా రూపు మారిపోయింది. వారిలో ఓ స్నేహితుడికి పరిస్థితి చెప్పి అతనితో బిల్లు కట్టించి అక్కడి నుంచి బయటపడ్డారు. 
    ఇలాంటి పరిస్థితిని ఎలా ఊహిస్తాం చెప్పండి? ఇదే అని కాదు జేబులో ఉన్న నగదుకు, వ్యాలెట్ కు భద్రత ఉంటుందని చెప్పలేము కదా. అందుకే జేబులో రూపాయి లేకపోయినా బిల్లులు చెల్లించడానికి ఏ మాత్రం వెనకాడక్కర్లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానం బ్యాకింగ్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లనుంది. బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణను చాలా సులభతరం చేయనుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. యూపీఐ యాప్ తో ఎవరికైనా క్షణాల్లో నగదు పంపుకోవచ్చు. అన్ని రకాల బిల్లులు చెల్లించవచ్చు. పర్సుతో పని లేకుండా చేసే యూపీఐతో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. నగదు లావాదేవీలను తగ్గించడమే ఈ విధానం వెనుక ముఖ్య ఉద్దేశం. ఐఎంపీఎస్ కు మెరుగైన విధానమే యూపీఐ విధానం. 


    వాస్తవానికి క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నా... ఇప్పటికీ ఎక్కువ మంది నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో ఉచిత నగదు లావాదేవీలు పరిమితం చేయడంతో నగదును డ్రా చేసుకుని వినియోగిస్తున్న వారు కూడా పెరిగారు. జేబులో నగదు ఉంటే కార్డులతో పనే ఉండదు. కానీ యూపీఐ మొబైల్ యాప్ ఉంటే ఇవేమీ లేకపోయినా ఫర్వాలేదు!. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుండడంతో మొబైల్ వ్యాలెట్ల వినియోగం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

    చాలా సులభం

    ప్రస్తుతం పేటీఎం, మొబిక్ విక్, పేయూ మనీ ఇలా పలు రకాల మొబైల్ వ్యాలెట్ యాప్ లు ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్స్. ముందుగా ఆయా వ్యాలెట్లలో నగదు నిల్వ చేసుకుని లేదా నగదు పంపుకుని గానీ అక్కడి నుంచి చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. యూపీఐ మాత్రం నేరుగా బ్యాంకు ఖాతా నుంచే నగదు లావాదేవీలను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం దాదాపుగా చాలా బ్యాంకులకు ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా లావాదేవీలు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వాటితో పోల్చినా యూపీఐనే సౌలభ్యం అని నిపుణులు పేర్కొంటున్నారు. 
    మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీల నిర్వహణకు ఇతరుల ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తదితర వివరాలు అవసరం. కొద్దిగా సంక్లిష్టమైన విధానం కావడంతో బ్యాంక్ యాప్స్ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అన్ని వేదికల్లోనూ లావాదేవీలు చేయడం సురక్షితమని చెప్పలేము. వాటి వివరాలను తస్కరించి డబ్బులు డ్రా చేసుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. పైగా ఆన్ లైన్ వేదికల్లో కార్డు వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి రావడం ప్రయాసతో కూడుకున్నదే. కానీ యూపీఐ ఇలాంటి ప్రతికూలతలన్నింటినీ చెరిపేసి లావాదేవీలను సులభతరం, సురక్షితం చేస్తుందని నిపుణుల విశ్లేషణ.

    లావాదేవీ ఇలా జరుగుతుంది...

    ఎలా అంటే ఒకరికి ఎస్ బీఐలో ఖాతా ఉందనుకుందాం. మరొక వ్యక్తికి ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉందనుకుందాం. ఈ రెండు బ్యాంకులు యూపీఐ తో కనెక్ట్ అయి ఉంటే చాలు. అప్పుడు వీరిద్దరిలో ఎవరు కావాలంటే వారికి నగదు పంపుకోవడం, తీసుకోవడం చాలా సులభం. ఇందులో నగదు లావాదేవీలకు బ్యాంకు ఖాతా నంబర్ తో పని లేదు. ప్రతి ఒక్కరికీ వర్చ్యువల్ అడ్రస్ ఉంటుంది. అది ఎలా అంటే ఏబీసీ@ఎస్ బీఐ ఇదే వర్చ్యువల్ ఐడీ. ఇలా కాకుండా మొబైల్ నంబర్@ఎస్ బీఐ లేదా ఆధార్ నంబర్@ఎస్ బీఐ అని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ బీఐ ఖాతాదారుడు ఒకరు యూపీఐ యాప్ ను తన మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని వర్చువల్ ఐడీ పొంది ఉన్నాడనుకుందాం. అతడు ఫ్లిప్ కార్ట్ లో ఓ ఉత్పత్తిని చూసి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పేమెంట్ సెక్షన్ లో యూపీఐని సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ వర్చువల్ ఐడీని ఇవ్వగానే కస్టమర్ మొబైల్ లోని యాప్ లో అలర్ట్ నోట్ కనిపిస్తుంది. సెక్యూర్డ్ పిన్ నంబర్ అక్కడ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ పూర్తయిపోతుంది. అలాగే, సూపర్ మార్కెట్ కు వెళ్లి వెయ్యి రూపాయల సరుకులు కొన్నారు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర వర్చువల్ ఐడీ చెప్పగానే తన మొబైల్ యాప్ లో లావాదేవీ ఆమోదం కోరుతూ నోట్ కనిపిస్తుంది. పిన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతా నుంచి నగదు సూపర్ మార్కెట్ ఖాతాకు బదిలీ అవుతాయి. 
    ఉదాహరణకు శ్రీరామ్ కు ఎస్ బీఐ లో ఒక ఖాతా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఒక ఖాతా ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్య నగదు బదిలీ చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యం. ఇందుకు ఆయా బ్యాంకు వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి లావాదేవీ పూర్తి చేయడం, ఆ నగదు అవతలి వైపు ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుంది. ఏ పేమెంట్ విధానంలో (ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ) పంపామన్నదానిపై ఈ సమయం ఆధారపడి ఉంటుంది. అలాగే, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ రెండు బ్యాంకుల మొబైల్ అప్లికేషన్లు శ్రీరామ్ మొబైల్ లో ఉన్నాయనుకుందాం. అప్పుడు ఆ రెండింటి మధ్య నగదు బదిలీ చేసుకోవాలంటే యాప్స్ వల్ల సాధ్యం కాదు. కానీ యూపీఐతో ఇది సాధ్యమే. ఎస్ బీఐ యాప్ లోకి వెళ్లి హెచ్ డీఎఫ్ సీ ఖాతా వర్చువల్ ఐడీతో నగదును ఎస్ బీఐ ఖాతాల జమ చేసుకోవచ్చు. అలాగే, ఎస్ బీఐ నుంచి హెచ్ డీఎఫ్ సీ ఖాతాక నగదు బదిలీ చేసుకోవచ్చు.

    ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే...

    బ్యాంకుకు అనుసంధానమైన యూపీఐ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత నగదు పొందాలంటే అవతలి వ్యక్తి వర్చువల్ ఐడీని, నగదు మొత్తాన్ని నమోదు చేయాలి. ఓకే చేసిన వెంటనే అవతలి వ్యక్తికి మొబైల్ యాప్ స్క్రీన్ పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. సంబంధిత వ్యక్తి తన ఎంపిన్ నమోదు చేయగానే లావాదేవీ పూర్తయి నగదు మొత్తం వెంటనే మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అదే విధంగా నగదును మరొకరికి బదిలీ చేయాలనుకుంటే సెండింగ్ మనీ/పేమెంట్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే నగదు పంపాలనుకుంటన్నామో ఆ వ్యక్తి వర్చువల్ ఐడీ, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఎంపిన్ ను నమోదు చేస్తే సరిపోతుంది. యూపీఐ ద్వారా లక్ష రూపాయల వరకు నగదు పంపుకోవచ్చు. ఒక లావాదేవీకి అర్ధరూపాయి మాత్రమే చార్జీ ఉంటుంది. 
    ఏ లావాదేవీ పూర్తి కావాలన్నా... నమోదిత మొబైల్ నంబర్ నుంచే ఎంపిన్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ఎన్ పీసీఐ భావిస్తోంది. ఎందుకంటే ఎన్ పీసీఐ యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా ఎంపిన్ నమోదు చేసిన తర్వాత ఆ పిన్ నంబర్ సరైనదేనా, నమోదిత మొబైల్ నంబర్ నుంచే వచ్చిందా, సిమ్ కార్డు సరైనదేనా అన్ని వివరాలను చెక్ చేసిన తర్వాతే లావాదేవీ పూర్తి చేస్తుంది. ఈ విధానం ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుని డెలివరీ సమయంలో నగదుతో పని లేకుండా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. గ్యాస్ బిల్లు, విద్యుత్ బిల్లు ఇలా ప్రతీ పేమెంట్ ను యూపీఐ విధానంలో చేసే రోజు త్వరలో రానుంది. ఒక విధంగా నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు నిర్వహించుకునే వారి సంఖ్య తగ్గింది. యూపీఐ ద్వారా అన్ని లావాదేవీలకు అవకాశం ఉండడంతో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లే అవసరం మరింత తగ్గుతుందని బ్యాకింగ్ నిపుణులు అంటున్నారు. 
    భవిష్యత్తులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలన్నది ఎన్ పీసీఐ ఆలోచన. అంటే ఎంపిన్ బదులు వేలిముద్ర వేయడం ద్వారానే లావాదేవీ పూర్తవుతుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే విడిగా ప్రతీ బ్యాంకుకు ఒక వర్చువల్ ఐడీని క్రియోట్ చేసుకుని ఎంపిన్ పొంది ఉండాలి. తర్వాత వీటన్నింటినీ కలిపి ఒకటే ఐడీగా మార్చుకోవచ్చు. బ్యాంకులు ప్రస్తుతం తమ యాప్ లను యూపీఐకి అనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకుంటున్నాయి. కొన్ని యూపీఐ ఎనేబుల్డ్ యాప్ ను విడుదల చేయనున్నాయి. అప్పుడు యూపీఐ యాప్ తో కాకుండా బ్యాంకు యాప్ ల ద్వారా కూడా యూపీఐ సేవలు పొందవచ్చు. 
    ‘పేమెంట్ చేయడానికి కార్డులు (క్రెడిట్, డెబిట్) ఉన్నాయి. మొబైల్ మనీ, ఇంటర్నెట్ ఈ వ్యాలెట్లు ఉన్నాయి. కానీ, ప్రత్యక్షంగా మొబైల్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నగదును పంపుకునే విధానం ఇప్పటి వరకూ లేదు అని యూపీఐ విధానానికి తన సలహాలు అందించిన యూఐడీఏ మాజీ చైర్మన్ నందన్ నీలేకని యూపీఐ యాప్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా (ఏప్రిల్ 12న) అన్నారు.

    జూన్ చివరి నాటికి

    సో మొబైల్ ఒక్కటి ఉంటే చాలు ఇతరత్రా ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. ఎంపిన్, వర్చువల్ ఐడీ గుర్తుంచుకుంటే చాలు. 29 బ్యాంకులు యూపీఐ విధానాన్ని అమలు చేయడానికి అంగీకరించగా... ప్రస్తుతానికి 19 బ్యాంకులు యూపీఐ విధానంలో చేరాయి. జూన్ చివరి నాటికి ఈ పేమెంట్ విధానం అందుబాటులోకి వస్తుందని ఎన్ పీసీఐ తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంస్థ. ప్రస్తుతం దేశంల ఐదు కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండగా... రానున్న ఐదేళ్ల కాలంలో వీరి సంఖ్య 50కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీన్ని బట్టి భవిష్యత్తు అంతా మొబైల్ లావాదేవీల మయం కానుందని తెలుస్తోంది.